వనపర్తి, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎ న్నికల్లో ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలను అమలు చేస్తుం దని పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సమర్థుడైన బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను పా ర్లమెంట్కు పంపించాలని ఆయన బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్లమెంట్ ఎ న్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి అధ్యక్షత వహించగా, నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమా ర్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ అబద్ధాల తో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, హామీలు అమలు చేయాలంటే మంత్రులు చేతులెత్తేస్తున్నారన్నా రు. రైతుబంధు, రుణమాఫీ లాంటి పథకాలను ఇంతవరకు అమలు చేయకుండా ఇప్పుడేమో ఎన్నికల కోడ్ అంటూ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ఎ న్నికల్లో ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చారని, కే వలం కొత్త బస్సులు లేకుండా బస్ ఫ్రీ అన్నది మాత్రమే కొనసాగుతుందన్నారు. ఇక మిగిలిన అన్ని హామీలను కాంగ్రెస్ సర్కారు ఆటకెక్కించిందని దుయ్యబట్టారు. రై తులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ అభాసుపాలైందని, ప్రజలంతా కాంగ్రెస్ మోసాలను వంద రోజుల్లోనే గుర్తించారన్నారు.
పదేండ్లుగా కేంద్రం లో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనేక తప్పిదాలకు పాల్పడుతున్నా కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్రను పోషించడంలోనూ విఫలమైందన్నారు. వ్యవసాయ రంగంలో నల్ల చట్టాల ను తెచ్చి అమలు చేస్తున్నా కాంగ్రెస్ కిమ్మనడం లేదన్నా రు. ఎమ్మెస్ స్వామినాథన్ కూతురు స్వయంగా తమకు భారతరత్న కంటే రైతులకు కనీస మద్దతు ధరను అ మలు చేయడమే ముఖ్యమని పేర్కొన్నప్పటికీ కాంగ్రెస్ మాత్రం మౌనం దాల్చిందన్నారు. రెండు జాతీయ పా ర్టీలు కలిసి రాష్ట్రంలో బీఆర్ఎస్పై పోరాటం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో హామీలు అమలు చేయాలని వస్తున్న ఒత్తిడిని తట్టుకోవడం కోసం కాంగ్రెస్ సర్కారు మరో కొత్త రాగం అందుకుందని, కేంద్రంలో అధికారంలోకి వస్తే హామీలు అమలవుతాయని ప్రజలను మభ్యపెడుతుందని పేర్కొన్నారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సమర్థవంతుడని, పేద ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిని పార్లమెంట్కు పంపించడం ద్వారా నిరుపేదలకు మేలు జరుగుతుందన్నారు. ఐపీఎస్ అధికారిగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో సక్సెస్గా పనిచేసి శభాష్ అనిపించుకున్నారన్నారు. అలాంటి వ్యక్తిని వెనుకబడ్డ నాగర్కర్నూల్ నుంచి పార్లమెంట్కు పంపించడం కోసం ప్ర తి కార్యకర్త పట్టుదలతో పనిచేయాలని నిరంజన్రెడ్డి పి లుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు గట్టు యాదవ్, నాయకులు అభిలాశ్రావు, రజిని, నాగం తిరుపతిరెడ్డి, లక్ష్మారెడ్డి, సర్దార్ఖాన్, కరుణ, కర్రెస్వామి, బిచ్చారెడ్డి, కురుమూర్తియాదవ్, మాణి క్యం, ఉంగ్లం తిరుమల్, నందిమల్ల అశోక్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రవీణ్కుమార్ను గెలిపించాలి
ఎన్నికల మహాయజ్ఞంలో నాగర్కర్నూల్ పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను గెలిపించాలని మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి కార్యకర్తలను కోరారు. గురుకులాల కార్యదర్శిగా ప్రవీణ్కుమార్ నిరుపేద విద్యార్థుల్లో వెలుగులు నింపారన్నారు. ప్రజా సమస్యలపై ప్రవీణ్కు పట్టు ఉందని, అలాంటి వ్యక్తిని పార్లమెంట్కు పంపిస్తే చాలా మేలు జరుగుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కార్యకర్తల్లో పట్టుదలను పెంచిందన్నారు. నియోజకవర్గం నుంచి అధికమెజార్టీ ఇచ్చి ప్రవీణ్కుమార్ను పార్లమెంట్కు పంపడంలో వనపర్తి కీ లకంగా నిలవాలన్నారు. ప్రజల అవసరాలు, కార్యకర్తల కోసం అవసరమైతే తాము నల్లకోర్టులు ధరించడానికీ సిద్ధంగా ఉన్నామని రావుల ప్రకటించారు. కేవలం 45 రోజులు కష్టపడితే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం పొందుతామని, కేసీఆర్లాంటి వ్యక్తి మండుటెండల్లో ప్రజల కోసం వెళ్తున్నాడని గుర్తు చేశారు. ప్రతి కార్యకర్త తన విజయం కోసం పని చేసినట్లుగా భావించాలని అప్పుడే విజయం వైపు నడుస్తామన్నారు.
వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పించి గెలిపిస్తే పార్లమెంట్లో పేదల గళం వినిపిస్తానని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. ఇంతవరకు పని చేసిన ఎంపీలంతా పార్లమెంట్లో ఏనాడూ ప్రజా స మస్యలపై మాట్లాడిన చరిత్ర లేదన్నారు. తాను జీతం కోసం రాజకీయాల్లోకి రాలేదని, కేవలం పేద ప్రజల అభివృద్ధి కోసమే వచ్చానన్నారు. అలంపూర్లో పుట్టి అచ్చంపేటలో పెరిగిన తా ను అన్ని నియోజకవర్గాల సమస్యలపై అంకితభావంతో పనిచేస్తానన్నారు. ఉద్యమకారుల ఆ శయాలు, తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలాలను వెలకట్టలేమని, వారి ఆశయ సాధన కో సం నిర్విరామంగా కృషిచేస్తానన్నారు. పేద వి ద్యార్థుల కోసం వెయ్యి గురుకులాలను ఏర్పా టు చేసిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో ని లిచారన్నారు. గురుకులాల స్ఫూర్తితో నేడు ప్ర పంచ వ్యాప్తంగా ఎందరో పేదలు ఉన్నత విద్యాభ్యాసాలు, ఉద్యోగాలు పొందుతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఆధ్వర్యంలో పని చేయడం గర్వంగా ఉందన్నారు.