Padi Kaushik Reddy | కమలాపూర్ మండలంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్న సమయంలో రాజకీయ విమర్శలు, వాస్తవాలకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ.. కేసీఆర్ కట్టిండు వాటిని ముట్టుకోమనేది లేకుండా ప్రజాస్వామ్యంలో అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఏ ప్రభుత్వాలున్నా.. ఎవరున్నా.. కేసీఆర్ ప్రభుత్వమైనా.. మేమైనా కొనసాగించాల్సిందేనంటూ తాము పంపిణీ చేసే ఇండ్లు కేసీఆర్ కట్టినవేనని చెప్పకనే చెప్పారు. ఈ క్రమంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కలగజేసుకుని ముమ్మాటికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మా కేసీఆర్ కట్టినవే అని నేను కూడా బరాబర్ చెప్పానన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తామే ఇచ్చామని చెప్పుకుంటూ సభ ఏర్పాటు చేయడంపై స్పందిస్తూ.. మీరిచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినవే అంటూ పొన్నం ప్రభాకర్తో పాడి కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదు.. నిజాలు మాట్లాడాలి. ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు చేయొద్దని పాడి కౌశిక్ రెడ్డి నిలదీశారు.
ముమ్మాటికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మా కేసీఆర్ కట్టినవే
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తామే ఇచ్చామని చెప్పుకుంటూ సభ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
మీరిచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినవే అంటూ పొన్నం ప్రభాకర్తో వాగ్వాదానికి దిగిన కౌశిక్ రెడ్డి https://t.co/gCsDrBmqPf pic.twitter.com/MnyYjMqDKR
— Telugu Scribe (@TeluguScribe) August 10, 2026
Harish Rao | సాగునీటి కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిన హరీశ్ రావు
Lok Sabha: లోక్సభలో 4 బిల్లులు.. సభ 2 గంటల వరకు వాయిదా
TN Assembly | తమిళనాడులో రాష్ట్ర గీతానికి పెద్దపీట.. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం