ఘట్కేసర్, ఏప్రిల్ 4: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలుపించాలని ఓటర్లకు మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం ఘట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ ముఖ్యనాయకులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఓటర్ల వద్దకు వెళ్లాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకుడు చామకూర భద్రారెడ్డి, ఘట్కేసర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ మాధవ రెడ్డి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.