కోహీర్, ఏప్రిల్ 4: బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లో చేరుతున్నానని తీన్మార్ మల్లన్న తప్పుడు వార్తను ప్రసారం చేశారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జహీరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. 12మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, అందులో తన పేరు రాశారని మండిపడ్డారు.
ఇలాంటి తప్పుడు వార్తలు రాసే వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. గురువారం నియోజకవర్గంలో పలు శుభకార్యాలకు హాజరయ్యానని వివరించారు. జహీరాబాద్ వదిలి పోలేదని, తీన్మార్ మల్లన్న మాత్రం ఇలాంటి తప్పుడు కథనాలు ప్రసారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు, చివరి వరకు బీఆర్ఎస్తోనే ఉంటానని స్పష్టం చేశారు.