బాలానగర్ , ఏప్రిల్ 4 : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని, మల్కాజిగిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం ఫతేనగర్ డివిజన్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఎమ్మెల్యేతో పాటు మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో తాగునీటి ఇబ్బందులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ప్రజలకు ఆరు గ్యారెంటీల ఆశ చూపి..అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిందన్నారు. ఎన్ని గ్యారెంటీలు అమలు చేసిందో వివరణ ఇవ్వాలన్నారు. రాగిడి మాట్లాడుతూ మల్కాజిగిరి స్థానం నుంచి తనను ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండాల సతీశ్గౌడ్, సీనియర్ నేతలు కుతాడి రాములు, డివిజన్ అధ్యక్షుడు భిక్షపతి పాల్గొన్నారు.