న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రితో పాటు బీజేపీ ఎంపీ ఒకరు, నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ (ఎన్ఎహ్బీ) పథకం కింద ఆర్థిక సహాయం పొందారు. అయితే కేంద్ర మంత్రి మాత్రం ఆ సబ్సిడీని తిరిగి చెల్లించారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. (Bhagirath Choudhary) లోక్సభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. గత ఐదేళ్లలో ఎన్హెచ్బీ పథకాల కింద అధికారంలో ఉన్న కేంద్ర మంత్రి, పార్లమెంట్ సభ్యుడు లేదా వారి కుటుంబ సభ్యులు సబ్సిడీని అందుకున్నారా? అని లోక్సభ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఒక ప్రశ్న అడిగారు.
కాగా, వ్యవసాయ శాఖ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ దీనికి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి, బీజేపీ ఎంపీ లుంబా రామ్ తమ వ్యవసాయ క్షేత్రాల కోసం ఆర్థిక సహాయం పొందారని మంగళవారం పార్లమెంట్కు తెలియజేశారు. ‘రాజస్థాన్ సిరోహి ఎంపీ లుంబా రామ్ 2025లో, రాజస్థాన్ అజ్మీర్ ఎంపీ, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి 2026లో ఆర్థిక సహాయం పొందారు. అయితే ఈ పథకం కింద పొందిన సబ్సిడీని సంబంధిత బ్యాంకుకు తిరిగి చెల్లించినట్లు భగీరథ్ చౌదరి తెలియజేశారు. ఎన్హెచ్బీలో జమ కోసం సంబంధిత బ్యాంకుకు తగిన ఆదేశాలు జారీ చేశాం’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు ప్రభుత్వ అధికారులు లేదా వారి కుటుంబ సభ్యుల దరఖాస్తుల విషయంలో ప్రయోజనం పొందటం, లేదా వైదొలగడం గురించి ప్రస్తుత ఎన్హెచ్బీ పథకం మార్గదర్శకాలలో ఎలాంటి నిర్దిష్ట నిబంధన లేదని వ్యవసాయం మంత్రి రామ్నాథ్ ఠాకూర్ స్పష్టం చేశారు. అయితే పారదర్శకమైన బహుళ స్థాయి యంత్రాంగం ద్వారా దరఖాస్తుల ప్రాసెస్ జరుగుతుందని అందులో వివరించారు.