మషీరాబాద్, ఏప్రిల్ 4: వరంగల్ లోక్సభ స్థానంలో తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని కోరుతూ సంఘం నేతలు గురువారం మాజీ మంత్రి హరీశ్రావును కలిసి వినతిపత్రం అందజేశారు. లోక్సభ ఎన్నికల్లో మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరారు.
వరంగల్ సీటు ఇస్తే మాదిగలమంతా గెలిపించుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ యువసేన అధ్యక్షుడు పొట్టపెంజర రమేశ్, కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ మల్లేశ్, గణేశ్, వేణు, నందిగామ నరసింహ, పాలడుగు శ్రీనివాస్, శివరాజ్, మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి, అంజి, శాంతి, నరేశ్, రాజేందర్ తదితరులు ఆయనకు విజ్ఞప్తి చేశారు.