హైదరాబాద్: తరుణ్ కపాలా..ఒక యువ ఎన్నారై.. ఇటీవలే అమెరికా నుంచి భారత్కు తిరిగి వచ్చారు.. కొవిడ్-19 రోగులు, వారి కుటుంబాలు పడుతున్న బాధలు చూసి చలించిపోయారు.. వారిని ఆదుకునేందుకు అంబులెన్స్ డ్రైవర్ అవతారం ఎత్తారు.. డెల్లాయిట్లో పని చేసిన తరుణ్ కపాలా.. హైదరాబాద్లోని స్ప్రింగ్ ఎంఎల్లో పని చేస్తున్నాడు.
ఇటీవల కరోనా సోకిన తన స్నేహితుడి బంధువు మ్రుతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్ యాజమాన్యం రూ.34 వేలు వసూలు చేసిందని తరుణ్ కపాలా తెలిపారు.. దీంతో తానే అంబులెన్స్ డ్రైవర్గా మారాలని అనిపించిందన్నారు.
తన అంబులెన్స్ సేవలు అణగారిన వర్గాల వారి కోసమేనని, వారి వద్ద నుంచి ఎటువంటి చార్జీలు వసూలు చేయడం లేదని అన్నారు తరుణ్ కపాలా.. గత వారం రోజుల్లో నగర వ్యాప్తంగా రెండు డజన్లకుపైగా ట్రిప్స్ చక్కర్లు కొట్టాడంటే అతిశయోక్తి కాదు..
పేషంట్లను దవాఖానకు తీసుకెళ్లడమే కాదు.. తరుణ్ కపాలా తన అంబులెన్స్లో ఆక్సిజన్ సపోర్ట్ ఏర్పాటు చేశాడు. దవాఖానలో వారిని అడ్మిట్ చేసే వరకు అక్కడే వేచి ఉంటాడు.
సగటున అంబులెన్స్కు రూ.8000 నుంచి రూ.35 వేల వరకు చార్జి చేస్తారు. నగరాలు, రాష్ట్రాల మధ్య దూరాన్ని బట్టి అంబులెన్స్ చార్జీ పెరుగుతుంది. కానీ తాను ఇప్పటివరకు ఉచితంగానే సేవలందించానని తరుణ్ కపాలా చెప్పారు.
బ్రెయిన్ స్ట్రోక్తో దవాఖానలో చేరిన తన తల్లిని చూసేందుకు డెల్లాయిట్ నుంచి హైదరాబాద్కు వచ్చారాయన. ఆమె బాగోగులు సోదరి చూసుకుంటుండటంతో తాను అంబులెన్స్ డ్రైవర్ అవతారం ఎత్తానని తెలిపారు.
ఒక పేరొందిన కళాశాలలో ప్రొఫెసర్గా పని చేసిన మహిళ, ఆమె కొడుకు కొవిడ్-19తో బాధపడుతూ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆమె భర్త కొవిడ్-19తో మరణిస్తే, చివరి చూపు కోసం వెళ్లాలంటే అంబులెన్స్ సౌకర్యం అందుబాటులో లేదు.. అప్పుడు ఆపద్బాంధవుడిలా తరుణ్ కపాలా కనిపించారు.
ఎవరికైనా సాయం అవసరమేమోనని తాను దవాఖానలో ఎమర్జెన్సీ వార్డ్ పక్కనే నిలిచినప్పుడు ఆమె కుటుంబానికి అంబులెన్స్ సౌకర్యం అవసరం అని తెలిసిందన్నారు. తాను ఆమెను తీసుకెళ్లడానికి వెళ్లినప్పుడు భావోద్వేగానికి గురయ్యానన్నారు.
దేవుడు తన బంటు ఏంజిల్గా తనను పంపకుంటే తన భర్తను చూడగలిగే దాన్ని కాదని ఆమె అనడంతో తరుణ్ కపాలా భావోద్వేగానికి గురయ్యారు.
ప్రధాని మోదీపై పోస్టర్లు.. 17 మంది అరెస్టు
అనిల్కి షాక్ భారత్కు స్విస్ వివరాలు
కెయిర్న్ చేతికి ఎయిర్ ఇండియా విదేశీ ఆస్తులు?
ఎయిర్టెల్ థాంక్స్ యాప్లో వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు!
Amazon miniTV: అమెజాన్ మినీ టీవీ లాంచ్.. పూర్తిగా ఉచితం
మౌత్వాష్ ఆర్డర్ చేస్తే.. స్మార్ట్ఫోన్ వచ్చింది!
ఎల్లుండి నుంచి హీరో బైకుల ఉత్పత్తి ప్రారంభం
గుంటూర్ జిల్లాలో దారుణం.. భార్య గొంతుకోసిన భర్త
లాక్డౌన్ ఉల్లంఘనుల నుంచి రూ 28 లక్షల జరిమానా వసూలు!
హెచ్-4 వీసాదారులకు గూగుల్ మద్దతు
కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న బిగ్ బీ
13 రోజులు ప్రధానిగా వాజ్పేయి.. చరిత్రలో ఈరోజు
ఒడిశాలో షూటింగ్లపై నిషేధం..!
బ్రిటన్ వైపు ఇండియన్ సంపన్నుల చూపు.. నిపుణులు కూడా..!
రేపు తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయ ద్వారాలు
యూపీలో దారుణం: కొవిడ్-19 రోగి కుటుంబంపై కాల్పులు?!