హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్( SIR ) కార్యక్రమాన్ని పొడిగించింది. ఆగస్టు 10 వ తేదీ వరకు ఓటర్లు తమ వివరాలను బీఎల్వో (BLOs ) లకు అందజేయాలని స్పష్టం చేసింది. బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఆగస్టు 17న డ్రాఫ్ట్ పబ్లికేషన్ను విడుదల చేస్తామని సెప్టెంబర్ 16వ తేదీ వరకు క్లెయిములు, అభ్యంతరాలను స్వీకరిస్తామని వివరించింది. ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు క్లెయిములను అభ్యంతరాలను పరిష్కరిస్తామని , అక్టోబర్19న ఫైనల్ పబ్లికేషన్ను విడుదల చేస్తామని వెల్లడించింది.