భువనేశ్వర్: దేశమంతటా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. రోజూ వేల మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షల మందికి పాజిటివ్గా తేలుతున్నది. దాంతో దేశంలోని వివిధ రాష్ట్రాలు మహమ్మారి తీవ్రతను బట్టి పలు రకాల ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు వీకెండ్ కర్ఫ్యూలు అమలు చేస్తుండగా, మరికొన్ని రాష్ట్రాలు కంప్లీట్ కర్ఫ్యూలను అమల్లోకి తెస్తున్నాయి.
కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు వీకెండ్ లాక్డౌన్లు విధించగా, వైరస్ ఎఫెక్ట్ మరింత తీవ్రంగా ఉన్న రాష్ట్రాలు కంప్లీట్ లాక్డౌన్లు విధిస్తున్నాయి. అందులో భాగంగా రకరకాల కార్యకలాపాలపై రకరకాల ఆంక్షలు విధిస్తున్నాయి. ఒడిశాలో కూడా ఇప్పటికే లాక్డౌన్ అమల్లో ఉండగా, ఇప్పుడు ఆ ఆంక్షలను మరింత కఠిన తరం చేస్తున్నట్లు ఒడిశా సర్కారు ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు రాష్ట్రంలో ఇండోర్, ఔట్డోర్ సహా అన్ని రకాల సినిమా, సీరియల్ షూటింగ్లపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది.