Commonwealth Games : కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్లిఫ్టర్లు గర్వపడే ప్రదర్శన చేస్తున్నారు. గ్లాస్గోలో అంచనాలు అందుకుంటూ ఇప్పటికే నలుగురు పతకాలు సాధించగా.. 58 కిలోల విభాగంలో వింద్యారాణి దేవి సొరొఖాబామ్ (Bindyarani Devi Sorokhaibam) కంచుమోత మోగించింది. హోరాహోరీగా సాగిన పోటీల్లో సత్తా చాటిన వింద్యారాణి 199 కిలోలు ఎత్తి దేశానికి కాంస్యం అందించింది. నాలుగేళ్ల క్రితం బర్మింగ్హమ్లో వెండి వెలుగులు విరజిమ్మిన మణిపూర్ తేజం ఈసారి మూడో స్థానంతో సరిపెట్టుకుంది.
గ్లాస్గో ఆతిథ్యమిస్తున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్లిఫ్టర్లు పోడియంపై మెరుస్తున్నారు. ఐదో రోజైన సోమవారం జ్ఞానేశ్వరి దేవి 53 కిలోల విభాగంలో వెండి పతకం సాధించగా.. 58 కిలోల విభాగంలో వింద్యారాణి దేవి సొరొఖాబామ్ కాంస్యం కొల్లగొట్టింది.
స్నాచ్లో 87 కిలోలు, ఆపై క్లీన్ అండ్ జెర్క్లో 112 కిలోలు ఎత్తిన వింద్యారాణి మూడో స్థానంలో నిలిచింది. తద్వారా వెయిట్లిఫ్టింగ్లో భారత్కు ఐదో పతకం అందించిందీ మణిపూర్ మహిళ. 2022 ఎడిషన్లో సిల్వర్ మెడల్.. ఐడబ్ల్యూఎఫ్ వరల్డ్కప్లోనూ పతకం గెలిచిన వింద్యా ఈసారి కాంస్యంతో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది.
Grit, grip, and glory! 🇮🇳
Many congratulations to Bindyarani Devi on winning a Bronze medal in Women’s 58kg category and securing India’s fifth medal in Weightlifting. Keep making the nation proud. pic.twitter.com/StRXSz9jBC
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 27, 2026