Nagole Murder Case | హైదరాబాద్ : నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ఆనంద్ నగర్ చౌరస్తా సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడని తెలిసిందే. ఖమ్మం ఇల్లేందుకి చెందిన పాత నేరస్తుడు( రౌడీ షీటర్) మహమ్మద్ నయీమ్ దారుణ హత్యకు గురైనట్టుగా పోలీసులు గుర్తించారు. కాగా ఇద్దరు రౌడీషీటర్ల మధ్య నెలకొన్న వివాదం ఒకరి దారుణ హత్యకు దారితీసింది.
ఇల్లందు పట్టణానికి చెందిన రౌడీషీటర్లు ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్ , మహమ్మద్ నహీమ్ చిన్ననాటి నుండి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులు. మహమ్మద్ నహీమ్ బండ్లగూడ సహభావన అపార్ట్మెంట్స్ లో నివాసముంటున్నాడు. సెటిల్మెంట్లు చేసిన డబ్బుల విషయంలో గత 3 నెలలుగా వీరిద్దరి మధ్య ముఠా కక్షలు పెరిగిపోయాయి. ఇద్దరిపైనా ఇప్పటికే పలు హత్య కేసులు, ఇల్లందు పోలీస్ స్టేషన్లో రౌడీషీట్లు నమోదై ఉన్నాయి.
ఈ పాత కక్షల నేపథ్యంలోనే మహేష్ మహమ్మద్ నహీమ్ను దారుణ హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. నాగోల్ పోలీసులు నిందితులు మహేష్ అండ్ టీం కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
Uttar Pradesh | యూపీలో కారు అదుపుతప్పి ముగ్గురు మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం
KA Paul | యుద్ధాలు 58, ప్రభావం 850 కోట్ల మందిపై.. ఆవేదన వ్యక్తంచేసిన కేఏ పాల్
హయత్నగర్ పరిధిలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ.. 20 మందికి తీవ్ర గాయాలు