NTR : టాలీవుడ్లో స్టార్ హీరోలు వరసగా గాయాలబారిన పడుతున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్(NTR) గాయపడ్డారు. సోమవారం సాయంత్రం అనుకోకుండా ఆయన భుజానికి గాయమైంది. దాంతో.. వెంటనే కుటుంబసభ్యులు ఆయనను ఆస్పత్రికి వెళ్లారు. ఎన్టీఆర్ను పరీక్షించిన వైద్యులు పూర్తిగా కోలుకునేంత వరకూ విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాలు రెస్ట్ తప్పనిసరి అని డాక్టర్లు చెప్పారు.
ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ (NTR 31) సినిమాతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అనకోకుండా గాయపడ్డారు. సోమవారం సాయంత్రం ఆయన భుజానికి గాయం కావడంతో ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్ జె. మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్.ఏ. పూర్ణచంద్ర తేజస్వీలు ఎన్టీఆర్ను పరీక్షించి.. చికిత్స అందించారు. పూర్తిగా కోలుకునేందుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందని చెప్పారు. కాబట్టి.. విశ్రాంతి తీసుకోవాలని ఎన్టీఆర్కు వైద్యులు సూచించారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అభిమానులతో పంచుకుంది ఎన్టీఆర్ కార్యాలయం. ఎవరూ అందోళన చెందవద్దని కోరింది. హీరో ఆరోగ్యం గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీతో పంచుకుంటామని పేర్కొంది. పరిస్థితిని అర్ధం చేసకుని.. మద్దతుగా నిలిచినందుకు ఫ్యాన్స్కు ధన్యవాదాలు తెలిపింది ఎన్టీఆర్ కార్యాలయం.
#NTR sustained an unfortunate shoulder injury and advised 6 to 8 weeks of complete Rest!
Wishing him a speedy recovery! pic.twitter.com/qD7pGQdKUD
— Tollywood Journal (@TollyJournal) July 27, 2026