Varanasi teacher : నర్సరీ విద్యార్థి (Nursery student) పట్ల ఓ టీచర్ (Teacher) అమానవీయంగా ప్రవర్తించింది. లాగులో మూత్రం పోసుకున్నాడన్న కోపంతో.. కూరగాయలు కోసే కత్తిని వేడిచేసి ఆ బాలుడి మర్మాంగం (Private Part) పై వాతలు పెట్టింది. మూడు రోజుల క్రితం వారణాసి (Varanasi) లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు టీచర్పైన, పాఠశాలపైన కేసు నమోదైంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కేసరి జైస్వాల్ కుమారుడు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ప్లే స్కూల్లో నర్సరీ చదువుతున్నాడు. శుక్రవారం పాఠశాల నుంచి వచ్చిన తర్వాత నొప్పిగా ఉందని తల్లికి చూపించాడు. వాతలు ఉన్నట్లు గమనించిన తల్లి.. భర్తకు ఈ విషయం చెప్పింది. ఆ మర్నాడు స్కూలుకు వెళ్లి ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదు. దాంతో జైస్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన కుమారుడు వాష్ రూమ్కు వెళ్తానని టీచర్ను అడిగినా..ఆమె పంపలేదని, మూత్రం నిక్కర్లో పోసేశాడని, అందుకు కోపగించిన ఆమె.. పక్క రూమ్కు తీసుకెళ్లి.. వాతలు పెట్టిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పందించారు. ఇది అత్యంత తీవ్రమైన చర్య అని ఎక్స్లో పోస్టు చేశారు.