ముజఫర్నగర్: ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లోని ఓ హార్ట్ స్పెషలిస్ట్, ఆయన సోదరుడు, దవాఖానలోని ఏడుగురు ఉద్యోగులు కొవిడ్-19 ఉద్యోగిపై దాడికి పాల్పడ్డారు. సైనీ హార్ట్ ఇన్స్టిట్యూట్లో చేరిన రోగికి అందిస్తున్న చికిత్స గురించి అతడి కుటుంబ సభ్యుడు అడగడమే నేరం.. ఆ కుటుంబంపై హార్ట్ స్పెషలిస్ట్ తదితరులు కాల్పులు జరిపారని ఆరోపణలు వచ్చాయి.
కోవిడ్-19 రోగి కుటుంబం పట్ల అనుచితంగా వ్యవహరించిన డాక్టర్ పేరు దేవేంద్ర సైనీ అని పోలీసులు గుర్తించారు. శుక్రవారం రాత్రే కొవిడ్-19 రోగి మరణించాడు. దీంతో ఆ రోగికి సంబంధించిన చికిత్స వివరాలను అడుగడంతో వైద్యుడు ఆగ్రహించినట్లు తెలుస్తున్నది.
డాక్టర్ దేవేంద్ర సైనీ తనను చెంపదెబ్బ కొట్టాడని బాధితుడు తెలిపారు. దీంతో తాను, మిగతా అటెండెండ్లు అభ్యంతరం వ్యక్తం చేశామన్నారు. తాము అభ్యంతరం వ్యక్తం చేసినందుకు దేవేంద్ర సైనీ సోదరుడు మనీశ్ తమను బెదిరించేందుకు నేరుగా కాల్పులు జరిపాడన్నారు.
డాక్టర్ దేవేంద్ర, మనీశ్లతోపాటు దవాఖాన సిబ్బంది తమపై దాడికి పూనుకున్నారని బాధితుడు వాపోయాడు. తాము ముజఫర్నగర్ కొత్వాలీకి ఫిర్యాదు చేయడానికి వెళితే పోలీసులు తమను ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని బెదిరించారన్నారు.
బాధితుల ఆవేదనను వినడానికి నిరాకరించిన పోలీసులు.. దవాఖానలో గందరగోళం చేశారన్న అభియోగంపై కేసు పెడతామని బెదిరింపులకు దిగినట్లు తెలుస్తున్నది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పుర్కాజీ ప్రమోద్ ఉత్వాల్ జోక్యంతో ఇరు పక్షాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుట్రదారులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రధాని మోదీపై పోస్టర్లు.. 17 మంది అరెస్టు
అనిల్కి షాక్ భారత్కు స్విస్ వివరాలు
కెయిర్న్ చేతికి ఎయిర్ ఇండియా విదేశీ ఆస్తులు?
ఎయిర్టెల్ థాంక్స్ యాప్లో వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు!
Amazon miniTV: అమెజాన్ మినీ టీవీ లాంచ్.. పూర్తిగా ఉచితం
మౌత్వాష్ ఆర్డర్ చేస్తే.. స్మార్ట్ఫోన్ వచ్చింది!
ఎల్లుండి నుంచి హీరో బైకుల ఉత్పత్తి ప్రారంభం
గుంటూర్ జిల్లాలో దారుణం.. భార్య గొంతుకోసిన భర్త
లాక్డౌన్ ఉల్లంఘనుల నుంచి రూ 28 లక్షల జరిమానా వసూలు!
హెచ్-4 వీసాదారులకు గూగుల్ మద్దతు
కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న బిగ్ బీ
13 రోజులు ప్రధానిగా వాజ్పేయి.. చరిత్రలో ఈరోజు
ఒడిశాలో షూటింగ్లపై నిషేధం..!