న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. వరుసగా ఆరో రోజూ మూడు లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మూడు వేలకుపైగా మరణాలు సంభవించాయి. ఇలా రోజువారీ మరణాలు మూడు వేలు దాటడం ఇదే మొదటిసారి. కాగా, రెండువేలకుపైగా మరణాలు నమోదవడం వరుసగా ఇది ఎనిమిదోరోజు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 2 లక్షలు దాటింది.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,60,960 పాజిటివ్ కేసులు నమోదవగా, 3293 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,79,97,267కు చేరగా, కరోనా మరణాలు 2,01,187 వద్ద నిలిచాయి. కొత్తగా 2,61,162 మంది కోలుకోవడంతో మొత్తం 1,48,17,371 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. మరో 29,78,709 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 14,78,27,367 మందికి కరోనా టీకా పంపిణీ చేశారు.
లక్షకు పైగా కరోనా మరణాలు సంభవించిన దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానంలో ఉన్నది. ఇప్పటివకు యూకే, ఇటలీ, రష్యా, ఫ్రాన్స్లో లక్షకుపైగా మరణాలు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా అత్యధికంగా మహారాష్ట్రలో 66,358 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 895 మంది మరణించారు. అదేవిధంగా దేశరాజధాని ఢిల్లీలో 24,149 మంది కరనాబారినపడగా, 381 మంది బాధితులు మృతిచెందారు. ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో 30 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా నిన్న 17,23,912 మందికి కరోనా పరీక్షలు చేశారు. దీంతో ఏప్రిల్ 27 నాటికి 28,27,03,789 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..