న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రముఖ ఎన్జీవోలతో కలిసి ఫెలోషిప్ అందిస్తున్నది. దీనికోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 30 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. 2021-22 విద్యాసంవత్సరానికిగాను ఈ ఫెలోషిప్ను అందిస్తున్నది.
ఇందులో ది యాంట్, ది ఉర్ముల్ రూరల్ హెల్త్, చిరాగ్, సేవా భారత్, రాష్ట్రీయ గ్రామీణ్ వికాస్ నిధి (ఆర్జీవీఎన్), ద ఎమ్మెస్ స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్ (ఎంఎస్ఎస్ఆర్ఎఫ్), సీవా మందిర్, గ్రామ్ వికాస్, డీహెచ్ఏఎన్ ఫౌండేషన్, బేర్ఫుట్ కాలేజీ, బీఏఐఎఫ్ డెవలప్మెంట్ రిసెర్చ్ ఫౌండేషన్, ఆగా ఖాన్ రూరల్ సపోర్ట్ ప్రోగ్రామ్ (ఇండియా), ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా వంటి ఎన్జీవోలు పాలుపంచుకుంటున్నాయి. ఫెలోషిప్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
అర్హతలు: డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
ఫెలోషిప్: ప్రతి నెల రూ.15,000, అలవెన్స్ కింద రూ. 1000లు 13 నెలలపాటు ఇస్తారు. ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 30 వెబ్సైట్: https://youthforindia.org
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..