భువనేశ్వర్: ఓ కుటుంబంలోని సభ్యులు ఎప్పిటిలాగే సోమవారం కూడా ఎవరి పనులకు వాళ్లు వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి తిరిగొచ్చిన ఆ ఇళ్లాలుకు బుస్.. బుస్.. అంటూ పాము బుసకొట్టిన శబ్దం వినపడుతున్నది. భయంతోనే ఇదేం శబ్దం కావచ్చునని ఇల్లంతా కలియవెతికింది. చివరికి తమ బెడ్రూంలో మంచం కింద కనిపించిన దృశ్యం చూడగానే ఆమె పై ప్రాణాలు పైకే పోయాయి. ఎందుకంటే ఆ మంచం కింద ఆమెకు 15 అడుగుల పొడవున్న పేద్ద కోడె నాగు కనిపించింది.
పామును చూడగానే ఆమె గట్టిగా మొత్తుకోవాలనుంది. కానీ, నోరయితే తెరుచుకుందికానీ, భయంతో శబ్దం మాత్రం బయటికి రాలేదు. దాంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంట్లోంచి బయటికి పరుగుతీసి ఇరుగుపొరుగుకు విషయం చెప్పింది. దాంతో స్థానికులు అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకుని, మంచం కింద నక్కిన పామును బయటికి రప్పించి బంధించారు.
సోమవారం మధ్యాహ్నం ఒడిశా రాష్ట్రం మయూర్భంజ్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. పామును బంధించిన అటవీ సిబ్బంది దాన్ని తీసుకెళ్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. అటవీ సిబ్బంది పామును పట్టడానికి సంబంధించిన దృశ్యాలను ఈ కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ఆస్పత్రిలో గొడవ.. డాక్టర్ను చెంపదెబ్బ కొట్టిన నర్సు, నర్సుపై డాక్టర్ దాడి.. వీడియో
యూకే నుంచి భారత్కు ప్రాణాధార వైద్య సామాగ్రి: కేంద్రం
క్యాన్సర్ రోగులు టీకా వేసుకోవచ్చు
25 మిలియన్ల ప్రేమను పొందిన లాహే లాహే సాంగ్
కరోనా వేళ భారత్కు బాసటగా నిలిచిన ఫ్రాన్స్, కువైట్
పదిమందిలో కలవొద్దు.. బాతఖానీ పెట్టొద్దు..