హైదరాబాద్: కరోనా వేళ భారత్కు ఫ్రాన్స్, కువైట్ దేశాలు బాసటగా నిలిచాయి. కరోనాను ఎదుర్కొనేందుకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. 2 వేల మందికి 5 రోజులు సరిపడా లిక్విడ్ ఆక్సిజన్ పంపుతున్నట్లు తెలిపింది. అధిక సామర్థ్యమున్న 8 ఆక్సిజన్ జనరేటర్లును పంపుతోంది. ఒక్కో జనరేటర్ 250 పడకలకు సంవత్సరమంతా సరఫరా చేయగల ఆక్సిజన్ను అందిస్తాయి. అదేవిధంగా ఐసీయూ పరికరాలు, 28 వెంటిలేటర్లు పంపుతున్నట్లు పేర్కొంది.
భారత్కు బాసటగా నిలవాలని కువైట్ క్యాబినెట్ నిర్ణయించింది. ఆక్సిజన్ పరికరాలు, వైద్యపరికరాలు పంపాలని నిర్ణయం తీసుకుంది. భారత్లో కరోనా మరణాలు తగ్గించేందుకు సహకరిస్తామని కువైట్ పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..