లక్నో: కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలు తీయడమే కాదు, కరోనా బారినపడి వారి ప్రాణాలు రక్షించడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యసిబ్బంది భావోద్వేగాలతో కూడా ఆటాడుకుంటున్నది. ఆస్పత్రులకు రోగుల తాకిడి రోజురోజుకు పెరిగిపోతుండటంతో వారికి బెడ్లు సమకూర్చడం నుంచి చికిత్స అందించడం వరకు ప్రతిదీ తలకు మించిన భారంగా మారిపోతున్నది. దాంతో వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
ఈ క్రమంలోనే పలు ఆస్పత్రుల్లో డాక్టర్లకు, డాక్టర్లకు మధ్య.. డాక్టర్లకు నర్సులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఒత్తిడిలో సహనం కోల్పోయి ఒకరిపై మరొకరు దూషణలకు దిగుతున్నారు. కింది స్థాయి సిబ్బందిపై చిందులు తొక్కుతున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లా ఆస్పత్రిలో డాక్టర్కు, నర్సుకు మధ్య గొడవ జరిగింది. ఒకరిని ఒకరు బండబూతులు తిట్టుకున్నారు. చివరికి సహనం నశించిన నర్సు డాక్టర్ చెంపపై గట్టిగా కొట్టింది. దాంతో డాక్టర్ ఆమెపై దాడికి పాల్పడ్డాడు.
కాగా, ఈ ఘటనపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాంపూర్ సిటీ మెజిస్ట్రేట్ రామ్జీ మిశ్రా కూడా ఘటనపై ఇద్దరిని వేర్వేరుగా విచారించారు. తాను కొట్లాడుతున్న డాక్టర్, నర్సు ఇద్దరితో విడివిడిగా మాట్లాడానని, ఇద్దరూ కూడా పని ఒత్తిడిని తట్టుకోలేకనే తాము సహనం కోల్పోయామని చెప్పారని తెలిపారు. ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతుందన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
యూకే నుంచి భారత్కు ప్రాణాధార వైద్య సామాగ్రి: కేంద్రం
క్యాన్సర్ రోగులు టీకా వేసుకోవచ్చు
25 మిలియన్ల ప్రేమను పొందిన లాహే లాహే సాంగ్
కరోనా వేళ భారత్కు బాసటగా నిలిచిన ఫ్రాన్స్, కువైట్
పదిమందిలో కలవొద్దు.. బాతఖానీ పెట్టొద్దు..