న్యూఢిల్లీ, ఆగస్టు 17: రిలయన్స్ జియో..పదేండ్ల క్రితం ప్రవేశపెట్టిన ప్లాన్ను మళ్లీ తీసుకొచ్చింది. సరికొత్తగా రూ.299 ప్లాన్ను ప్రవేశపెట్టింది. భారతీ ఎయిర్టెల్ ఈ ప్లాన్ను ఇటీవల ఎత్తివేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నూతన ప్లాన్ కింద రోజుకు రూ.1.5 జీబీ డాటా, అన్ లిమిటెడ్ కాల్స్ అందిస్తున్నది.
దీంతోపాటు జీయో ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ కస్టమర్లు రూ.300 చెల్లించి జియో ప్రైమ్లో చేరవచ్చని తెలిపింది. ఈ సరికొత్త ప్లాన్లో 500 జీబీ స్టోరేజ్ కలిగిన గూగుల్ క్లౌడ్ను ఉచితంగా అందుకోవచ్చునని వెల్లడించింది.