న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: కరోనాతో ఇబ్బందులు పడుతున్న భారత్కు ఆధ్యాత్మిక గురువు దలైలామా బాసటగా నిలిచారు. ‘పీఎం-కేర్స్’కు విరాళం ఇవ్వాలని దలైలామా ట్రస్టుకు సూచించారు. ‘కరోనా ప్రభావం ప్రపంచమంతా ఉన్నది. ముఖ్యంగా భారత్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఈ కష్టకాలంలో భారత్కు అండగా నిలువాలని నిర్ణయించాం. ఈ మహమ్మారి నుంచి ప్రపంచం త్వరలోనే బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని దలైలామా పేర్కొన్నారు.