న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: భారతదేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతికి యూకే రకం వైరస్లాగే డబుల్ మ్యుటెంట్ కూడా ఓ కారణమని, అయితే ఇంతకుముందున్న వైరస్తో పోల్చితే డబుల్ మ్యుటెంట్ ప్రాణాంతకమైనదని చెప్పడానికి సరిపడినన్ని ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు తెలిపారు. ‘కరోనా సెకండ్ వేవ్లో వ్యాధి తీవ్రత, మరణాలు పెరగడానికి డబుల్ మ్యుటెంటే కారణం అని చెప్పడానికి సరిపోయే ఆధారాలు లేవు. కానీ వేగంగా వ్యాపిస్తున్న మాట నిజం. మరణాలకు సంబంధించి డబుల్ మ్యుటెంట్పై ఇంకా అధ్యయనాలు జరుగాల్సి ఉంది’ అని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ(ఐజీఐబీ) డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ చెప్పారు.