(Vishaka ZP) విశాఖపట్నం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా ముగిసింది. ప్రోటోకాల్ అంశంపై వాగ్వాదం చోటుచేసుకున్నది. మంత్రి అవంతి సమక్షంలోనే అధికార పార్టీ ఎమ్మెల్యేపై జెడ్పీటీసీ సభ్యులు చిందులు తొక్కారు. తొలిసారి జరిగిన సర్వసభ్య సమావేశమే ఇంత ఘర్షణపూరిత వాతావరణంలో జరగ్గా.. రానున్న రోజుల్లో మరెంత రంజుగా సాగుతాయో అని సామాన్యులు చర్చించుకుంటున్నారు.
విశాఖ జెడ్పీ తొలిసారి భేటీ అయింది. మంత్రి అవంతి శ్రీనివాస్తోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జెడ్పీటీసీ సభ్యులకు మండల కార్యాలయాల్లో కనీసం కుర్చీ కూడా వేయడం లేదని, మండల సమావేశాల్లో మాట్లాడేందుకు అవకాశం కూడా ఇవ్వడం లేదని పలువురు ఒకే గొంతుతో లేచారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కన్నబాబు రాజు.. మండల కార్యాలయాల్లో జెడ్పీటీసీలకు ఛాంబర్లు కేటాయించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. దాంతో కన్నబాబు రాజుపై జెడ్పీటీసీ సభ్యులు మూకుమ్మడిగా వాగ్వాదానికి దిగడంతో సమావేశం వేడెక్కింది.
మూడు రాజధానులకే ఓటు
కాగా, రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ కోసం ప్రభుత్వం మూడు రాజధానులను తీసుకురావాలని విశాఖ జెడ్పీ సమావేశంలో తీర్మానం చేశారు. తొలిసారి సమావేశమైన జెడ్పీ మీటింగ్లో మూడు రాజధానుల తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. ఏకగ్రీవంగా సభ తీర్మానించింది. ఈ తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపించి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయనున్నట్లు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు.
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
కొవిడ్ వైరస్ చేరిందో.. ఈ మాస్క్ మెరుస్తుంది! కనిపెట్టిన జపాన్ శాస్త్రవేత్తలు
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..