CM KCR Pressmeet | కేంద్రప్రభుత్వం దేశాన్ని అన్ని విధాలుగా నాశనం చేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr) తీవ్రంగా మండిపడ్డారు. ఇవాళ మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బీజీపీ విభజన రాజకీయాలు చేస్తోంది. భారత్ను ఆకలిరాజ్యంగా మార్చేసిందని ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ద సంస్థలపై బీజేపీకి గౌరవం లేదు. ఎవరినైనా బెదిరించగలం..ఏదైనా చేయగలమనే ధోరణిలో కేంద్రం వెళ్తోందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
దేశాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ దేశాన్ని కాపాడాలని భారత ప్రధాన న్యాయమూర్తిని, సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరిని, దేశంలోని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను. జడ్జిలను వినయపూర్వకంగా వేడుకుంటున్నానన్నారు. సీబీఐ, ఈడీ, సీవీసీ సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోంది. దేశంలో ప్రజాస్వామ్య హత్య జరుగుతోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అందరినీ కోరుతున్నా.. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని.. ఓటమైనా, గెలుపైనా గంభీరంగా స్వీకరించాలని బీజేపీ నేతలకు హితవు పలికారు.
హంతకుల స్వైర విహారం ఈ దేశం పునాదులకే ప్రమాదం : సీఎం కేసీఆర్
CM KCR Pressmeet | బీజేపీ నుంచి దేశాన్ని కాపాడాలని వేడుకుంటున్నా: సీఎం కేసీఆర్
CM KCR Pressmeet | రాబోయే రోజుల్లో జేపీ లాంటి ఉద్యమాలు చూడబోతరు : సీఎం కేసీఆర్