CM KCR Pressmeet : బీజేపీ దుర్మార్గపు చర్యలను దేశ ప్రజలు, యువత, మీడియా ముక్తం కంఠంతో ఖండించాలి అని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రజాస్వామ్యంలో ఇవి వాంఛనీయం కాదు. క్రూరమైన పద్ధతుల్లో జరిగే దమనకాండను అడ్డుకోకపోతే దేశం యొక్క ఉనికి అంతర్జాతీయ స్థాయిలో పోతదని పేర్కొన్నారు. ప్రగతి భవన్లో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఒక్కసారి దేశం దెబ్బతిన్నదంటే వంద సంవత్సరాలు వెనక్కిపోతం. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో చెబుతున్నాను. మన రాష్ట్రంలో కూడా బీజేపీ నాయకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాను. ఏ అహంకారానికి ఇది నిదర్శనం. ఎవరు సహించబడాలి. దీని వెనుకాల ఎవరు ఉన్నారు. గత నెలలోనే ఇక్కడికి ఒకాయన రామచంద్రభారతి అనే వ్యక్తి వచ్చాడు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని విశ్వప్రయత్నం చేసి కలిసి మాట్లాడాడు. వారు ఏం ప్లాన్ చేసిండ్రో అర్థమైన తర్వాత మాకు ఫిర్యాదు చేశారు. హోంమంత్రికి కూడా ఫిర్యాదు చేశారు. దానిపై సమగ్ర విచారణ జరగాలి. అది పెద్దగా ఉన్నది. మూడు గంటలు ఉంది దాదాపు. కానీ కోర్టు, ప్రజల కోసం అవసరమైన మేరకు ఇస్తున్నాం. మీరు కూడా ఆశ్చర్యపోతారు. వారు తీసుకున్న పేర్లలో దేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్నారు.
8 ప్రభుత్వాలు కూలగొట్టాం. మరో 4 ప్రభుత్వాలు కూలగొడుతాం. తెలంగాణ, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లో ప్రభుత్వాలు కూలగొడుతాం అని ఆ ముఠా సభ్యులు పేర్కొన్నారు. దీన్ని రాజకీయం అంటారా? అక్కడ మౌనం పాటించారు కాబట్టి 8 ప్రభుత్వాలు కూలిపోయాయి. తెలంగాణ చైతన్యవంతమైన గడ్డ కాబట్టి.. ఈ రాక్షసుల కుట్రను బద్దలు కొట్టారు. ఆ ముఠాను పట్టుకున్నాం కాబట్టి ఇదంతా బయటకు వచ్చింది. గత అనేక రోజులుగా ఈ వ్యవహారం జరుగుతుంది. ఈడీ టు ఇన్ కమ్ ట్యాక్స్ అంతా మా వద్దే ఉన్నరు అని చెప్పారు. ఈ దేశంలో ఏం జరుగుతోంది. ఈ ముఠాల స్వైరవిహారం చూస్తే మీరు ఆశ్చర్యపడుతారు. ఈ ముఠాలో 24 మంది సభ్యులు ఉన్నారు. ఒక్కొక్కరికి రెండు మూడు ఆధార్ కార్డులు ఉంటాయి. ఇది పెద్ద ఫ్రాడ్. మొన్న దొరికిన కేరళకు చెందిన తుషార్.. వయనాడ్లో రాహుల్పై పోటీ చేశారు అని కేసీఆర్ గుర్తు చేశారు.
హంతకుల స్వైర విహారం ఈ దేశం పునాదులకే ప్రమాదం : సీఎం కేసీఆర్
CM KCR Pressmeet | బీజేపీ నుంచి దేశాన్ని కాపాడాలని వేడుకుంటున్నా: సీఎం కేసీఆర్
CM KCR Pressmeet | రాబోయే రోజుల్లో జేపీ లాంటి ఉద్యమాలు చూడబోతరు : సీఎం కేసీఆర్