CM KCR Pressmeet | ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)తో ఓటింగ్ నిర్వహించినంత వరకు దేశంలో బీజేపీ విజయానికి ఢోకా లేదని ఈ ముగ్గురి ముఠా చెబుతున్నదని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెప్పారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేల కొనుగోళ్లకు రూ. వందల కోట్లు ఇస్తాం.. వేల కోట్లిస్తాం.. అని ఈ ముఠా చెప్పినరని గురువారం ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చెప్పారు. దీని వెనుక ఉన్న దొంగల ముఠా ఎవరు అని ప్రశ్నించారు.
అయితే గోడీ.. లేదంటే ఈడీ అని ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తున్నరని సీఎం కేసీఆర్ అన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే ఎమ్మెల్యేలపై ఈడీ, ఇన్కం ట్యాక్స్ అధికారులు దాడులు చేయకుండా చూస్తామని హామీ ఇచ్చారని అన్నారు. వారికి ఏ క్యాటగిరీ భద్రత కల్పిస్తారో కూడా ఈ ముఠా చెబుతదని మండి పడ్డారు.
హంతకుల స్వైర విహారం ఈ దేశం పునాదులకే ప్రమాదం : సీఎం కేసీఆర్
CM KCR Pressmeet | బీజేపీ నుంచి దేశాన్ని కాపాడాలని వేడుకుంటున్నా: సీఎం కేసీఆర్
CM KCR Pressmeet | రాబోయే రోజుల్లో జేపీ లాంటి ఉద్యమాలు చూడబోతరు : సీఎం కేసీఆర్