ఈ దేశం కోసం చావాల్సి వస్తే చస్తాం.. కానీ దేశాన్ని సర్వనాశనం చేస్తామంటే ఎవరూ ఊరుకోరని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)హెచ్చరించారు. ఇవాళ మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ కుట్రలను అందరికీ తెలియజేసేలా 3 గంటల వీడియోను బయటపెట్టారు. దేశ ప్రధానమంత్రే స్వయంగా మమతాబెనర్జీని పట్టుకొని..మీ 40 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని అన్నారని..ఈ విధానం కొనసాగితే దేశ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని సీఎం కేసీఆర్ యావత్ దేశప్రజలకు సూచించారు..
దేశ ప్రధానే ఇలా ఉంటే మిగితా వారు ఎలా ఉంటారో ఆలోచించాలని కోరారు. ప్రధానే ఇలా ఉంటే ఆయనకిందుండే నాయకులు ఈ పని చేయకుంటే ఏం జేస్తరని ప్రశ్నించారు. మోదీతో సరిగా లేకపోతే ఈడీ వస్తదని చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చింది మేమే అన్నారు. అమిత్ షా పేర్లు పలుమార్లు చెప్పారు..మోదీ పేరు రెండు సార్లు చెప్పారు. ఈ వ్యవహారాన్ని ఒకే ఒక్క కేసుగా చూడొద్దని న్యాయమూర్తులకు విజ్ఞప్తి చేస్తున్నా. దేశం ఎప్పుడు ప్రమాదంలో పడ్డా ఈ దేశాన్ని కాపాడింది న్యాయవ్యవస్థనేన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలుకు రూ.వేల కోట్లు ఖర్చు చేశారు. ఒక్కో సభ్యుడికి వందలు, వేల కోట్లు ఇస్తామన్నారు. ఇవన్నీ బయటకు రావాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఢిల్లీ సీఎంను అప్రమత్తం చేశామన్నారు. ఈవీఎంలు ఉన్నంతవరకు బీజేపీకి ఢోకా లేదనుకుంటున్నారు. ఇది ఇట్లాగే కొనసాగితే ఎవరు ఎవరిని చంపుతారో తెలియదని.. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. ఈ విధానాలు దేశానికి మంచిది కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలు, యువతదేనన్నారు.
హంతకుల స్వైర విహారం ఈ దేశం పునాదులకే ప్రమాదం : సీఎం కేసీఆర్
CM KCR Pressmeet | బీజేపీ నుంచి దేశాన్ని కాపాడాలని వేడుకుంటున్నా: సీఎం కేసీఆర్
CM KCR Pressmeet | రాబోయే రోజుల్లో జేపీ లాంటి ఉద్యమాలు చూడబోతరు : సీఎం కేసీఆర్