CM KCR Press Meet | ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొడుతూ.. స్వైరవిహారం చేస్తున్న ఈ ముఠా చిన్నది కాదు. 24 మంది ఉన్నామని వారే చెబుతున్నారు అని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. మా స్కానర్లో ఉంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదని ఎమ్మెల్యేలకు ఆ ముఠా సభ్యులు హామీ ఇచ్చారు. వచ్చిన ముఠాలోని ఒక్కో వ్యక్తికి 3 ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఉన్నాయి. వచ్చిన ముఠాలోని ఒక్కో వ్యక్తికి రెండేసి డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయి. మేం సేకరించిన ప్రతి ఆధారాన్ని కోర్టుకు పంపుతున్నాం అని కేసీఆర్ తెలిపారు.
నకిలీ ఆధార్, పాన్ కార్డులు వీరికి ఎవరిచ్చారు. వేల కోట్ల రూపాయాలు వీరికి ఎక్కడి నుంచి వచ్చాయి. మాకు ప్రత్యేకమైన అరెంజ్మెంట్లు ఉంటాయి అని పేర్కొంటున్నారు. ఇది పెద్ద ఫ్రాడ్. ఆధార్ కార్డుల్లో డిఫరెంట్ పేర్లు ఉంటాయి. తండ్రి పేరు కూడా డిఫరెంట్ ఉంది. మొన్న హైదరాబాద్లో పట్టుబడ్డ తుషార్ అనే వ్యక్తి బీజేపీ టికెట్ పై రాహుల్ గాంధీపై వయనాడ్లో పోటీ చేశారు. అమిత్ షానే ఆయనను పోటీకి దింపారు. ఏం దౌర్భాగ్యం ఇది. ఎవరు కాపాడాలి ఈ దేశాన్ని. ఈ దేశం ఎక్కడికి పోతోంది. ఒక్కో వ్యక్తికి మూడు ఆధార్ కార్డులు ఉన్నాయి. పాన్ కార్డులు మూడు మూడు ఉంటాయి. వ్యక్తి ఒక్కడే పేర్లు మారుతాయి. ఒకటే వ్యక్తికి రెండు మూడు డ్రైవింగ్ లైసెన్సులు ఉంటాయి. వీటిన్నింటిని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లొచ్చు. వీటన్నింటిని కోర్టుకు పంపించాం. ఇది ఆషామాషీ ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. చాలా భారమైన గుండెలతో మాట్లాడుతున్నాను. ఈ దేశం కోసం చావాల్సి వస్తే చస్తాం.. కానీ దేశాన్ని సర్వనాశనం చేస్తమంటే ఎవరూ ఊరుకోరు. ఈ విధానమే కరెక్టు కాదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
హంతకుల స్వైర విహారం ఈ దేశం పునాదులకే ప్రమాదం : సీఎం కేసీఆర్
CM KCR Pressmeet | బీజేపీ నుంచి దేశాన్ని కాపాడాలని వేడుకుంటున్నా: సీఎం కేసీఆర్
CM KCR Pressmeet | రాబోయే రోజుల్లో జేపీ లాంటి ఉద్యమాలు చూడబోతరు : సీఎం కేసీఆర్