CM KCR Pressmeet | : దేశ ప్రయోజనాల దృష్ట్యా ఏ మాత్రం వాంచితం కానటువంటి ఈ పరిస్థితులను మార్చాలి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ దుర్మార్గపు చర్యల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువత, విద్యార్థులు, ప్రజలు, మేధావులదే. ఎవరు మౌనంగా ఉన్నా చాలా పెద్ద ప్రమాదం వస్తది. రాబోయే రోజుల్లో జేపీ లాంటి ఉద్యమాలు చూడబోతరు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
మమ్మల్ని ఎవరు ఏం చేయలేరనే ధోరణితో ముందుకు పోతున్నారు. ఈ దుర్మార్గాలు అరికట్టబడాలి. దుర్మార్గాన్ని ఉపేక్షించడం అనేది ఏ ఒక్కరికి, దేశం ఉనికికి మంచిది కాదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే బీజేపీ కొంటుంది. రూ. 100 కోట్లు ఇస్తం. గతంలో అలానే ఇచ్చాం. ఇది మాకు నిత్య కృత్యమే. మిగతావి కూడా చేసుకుంటాం. సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తమని చెప్తరు. సెంట్రల్ సెక్యూరిటీ వై కేటగిరి ఇస్తమని చెప్తరు. రాజ్యాంగేతర శక్తుల్లో భారత ప్రభుత్వం ఉంది. ఈ వీరవిహారం అరికట్టబడకపోతే అందరికీ ప్రమాదమే. ఈ పద్ధతిని ప్రతి ఒక్కరూ ఖండించాలి. ప్రతి స్టేట్లో ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని చెప్తరు. ప్రధానిగారే చెబుతున్నారు. ఇదేం దేశం. ఇష్టమొచ్చినట్లు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఇవన్నీ కూడా బయటకు రావాలి. డిమాండ్ చేస్తున్నా. కాంట్రాక్టులు ఎలా ఇస్తున్నారు. ఈ ఎన్నికలు ఇవన్నీ ఎందుకు. ఈ రకమైన పద్ధతులు మంచిది కాదు. మేం దుర్మార్గంగా ఎమ్మెల్యేలను కలుపుకోలేదు. కొందరు కాంగ్రెస్ మిత్రులు మాదగ్గరికి వచ్చి కలుస్తామని చెప్పారు. చాలా రోజుల తర్వాత రాజ్యాంగబద్ధమైన పద్దతుల్లో కలుపుకొన్నాం. కానీ మీలా కొనుగోలు చేయలేదు. ఎమ్మెల్యేలను కొంటామని చెప్పి.. నీ ప్రభుత్వాన్ని కూలగొడుతామని వ్యవహరిస్తే మేం చేతులు ముడుసుకొని కూర్చోవాలా? మీ అరాచక వ్యవహారాన్ని నిశబ్దంగా భరించాలా? అని కేసీఆర్ ప్రశ్నించారు.
హంతకుల స్వైర విహారం ఈ దేశం పునాదులకే ప్రమాదం : సీఎం కేసీఆర్
CM KCR Pressmeet | బీజేపీ నుంచి దేశాన్ని కాపాడాలని వేడుకుంటున్నా: సీఎం కేసీఆర్
CM KCR Pressmeet | రాబోయే రోజుల్లో జేపీ లాంటి ఉద్యమాలు చూడబోతరు : సీఎం కేసీఆర్