హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ వెబ్ కౌన్సెలింగ్ మొదటి విడుత సీట్లను ఆదివారం కేటాయించారు. 1,743 సీట్లు ఉంటే కేవలం 1,400 మంది మాత్రమే వెబ్ ఆప్షన్లు ఎంచుకోగా, 1,106 మంది మాత్రమే సీట్లు దక్కించుకున్నారు. కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడుత సీట్ల కేటాయింపు తర్వాత 637 సీట్లు మిగిలాయి. సీట్లు పొందిన వారు ఈనెల 6లోపు సీట్లు వచ్చిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ పొండురంగారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
టీజీసీజీటీఏ నూతన కార్యవర్గం ఎన్నిక
హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గెజిటెడ్ టీచర్స్ అసొసియేషన్ (టీజీసీజీటీఏ) నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కే సురేందర్రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా జే చిన్న, ఉపాధ్యక్షుడిగా కే తిరుపతయ్య, ప్రధాన కార్యదర్శి బీ యాదయ్య, ఆర్థిక కార్యదర్శిగా ఎన్ రమేశ్, మహిళా కార్యదర్శిగా సీహెచ్ జ్యోత్స్న, కార్యవర్గ సభ్యు లుగా పావని, కిరణ్కుమార్, మల్టీజోన్-1 కార్యదర్శిగా యూ రవికుమార్, మల్టీజోన్-2 కార్యదర్శిగా పీ నర్సింహులును ఎన్నుకున్నారు.