అనుకున్నదే జరుగుతుంది.. నితిన్ సినిమాది ఆరంభ శూరత్వమే అని మరోసారి రుజువైంది. ఈయన నటించిన రంగ్ దే కలెక్షన్స్ 4 రోజుల తర్వాత దారుణంగా పడిపోయాయి. నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరీ తెరకెక్కించిన ఈ చిత్రం తొలి 4 రోజుల్లోనే 14 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. అయితే ఐదో రోజు నుంచి పడిపోయింది. సెలవులు లేకపోవడం.. కరోనా కేసులు కూడా పెరిగిపోతుండటంతో రంగ్ దే వైపు ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇప్పటి వరకు 8 రోజుల రన్ పూర్తి చేసుకున్న రంగ్ దే.. రూ.16 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓ రకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాకు వచ్చిన టాక్ పరంగా చూస్తే మంచి వసూళ్లే కానీ లక్ష్యం మాత్రం చాలా దూరంలోనే ఉండిపోయింది. ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే అక్షరాలా రూ. 24 కోట్లు వసూలు చేయాలి.
నైజాం: 5.57 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.71 కోట్లు
సీడెడ్: 2.08 కోట్లు
ఈస్ట్: 1.04 లక్షలు
వెస్ట్: 66 లక్షలు
గుంటూరు: 1.20 కోట్లు
కృష్ణా: 71 లక్షలు
నెల్లూరు: 51 లక్షలు
ఈ సినిమా సేఫ్ కావాలంటే మరో రూ.8 కోట్లు వసూలు చేయాలి. ఇప్పటికే చాలా చోట్ల వసూళ్లు పడిపోవడంతో నితిన్ సినిమా అంత దూరం వెళ్తుందడనుకోవడం అత్యాశే అవుతుంది. దాంతో రంగ్ దే సినిమా కూడా ఫ్లాప్ లిస్టులోకి వెళ్లిపోయేలా కనిపిస్తుంది. దానికితోడు వైల్డ్ డాగ్, సుల్తాన్ లాంటి సినిమాలు రావడంతో నితిన్ సినిమాపై ఆసక్తి కూడా తగ్గిపోయింది. ఎలా చూసుకున్నా కూడా నితిన్కు రంగ్ దే రూపంలో మరోసారి నిరాశ తప్పలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
తమిళ నటి గౌరీ కిషన్ కు కరోనా పాజిటివ్
యువరత్న 2 డేస్ కలెక్షన్స్.. పవర్ స్టార్ పాచిక పారలేదుగా..!
వైల్డ్ డాగ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..
హిందీలో రష్మిక మందన్న, హన్సికను ఓడించిన అల్లు శిరీష్
లాక్డౌన్ విధించకండి: మహా సీఎంకు సినీ పరిశ్రమ వినతి
‘పుష్ప’ నుంచి మరో క్రేజీ అప్డేట్
వకీల్ సాబ్ సినిమాలో మెగా హీరో గెస్ట్ రోల్
రజనీకాంత్ తో ఈ ఫోటోలో ఉన్న సూపర్ స్టార్ ఎవరో తెలుసా..?
ఉదిత్ నారాయణ్ కుటుంబంలో కరోనా కలకలం
రికార్డు స్థాయి థియేటర్లలో వకీల్ సాబ్ రిలీజ్
అందంతో మాయ చేస్తున్న రాయ్లక్ష్మీ..స్టిల్స్
వైష్ణవ్ తేజ్ కోసం క్యూ కడుతున్న దర్శకులు