హైదరాబాద్, ఏప్రిల్ 25 ( నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లేందుకు ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న వారికి తిరుగుప్రయాణంపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గురువారం ట్వీట్(ఎక్స్) చేశారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే అన్ని సర్వీసుల్లోనూ ఈ రాయితీ వర్తిస్తుందని వెల్లడించారు. గంటకో ఏసీ బస్సు అందుబాటులో ఉంటుందన్నారు. జేబీఎస్ నుంచి రూ.524, బీహెచ్ఈఎల్ నుంచి రూ.564 టికెట్ ధరగా నిర్ణయించారని తెలిపారు. ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్సైట్ని సంప్రదించాలని సూచించారు.