Brahmaji | పద్మ శ్రీ అవార్డు గ్రహీత 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కిన్నెర మొగిలయ్యకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నెలకు రూ.10 వేల పెన్షన్ను కాంగ్రెస్ సర్కారు నిలిపివేసింది. దాంతో ఆయన ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నిరుపేద కళాకారుడిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే మొగిలయ్య పరిస్థితి అత్యంత దారుణంగా ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. తెలంగాణ కళాకారుడిని ఇలా అవమానిస్తారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇదిలావుంటే.. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యని కలిసి అండగా ఉంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు హామీ ఇచ్చాడు. మొగిలయ్యను కలిసి భరోసా కల్పించినందుకు తనకు చాలా సంతోషంగా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మొగిలయ్య గొప్ప కళాకారుడని, ఆయన తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని కొనియాడారు. ఈ మేరకు కేటీఆర్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ఆ పోస్టుకు బీఆర్ఎస్ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో ఉన్న వీడియోను షేర్ చేశారు.
Happy to have fulfilled the word I gave to support Padmasri Moguliah Garu who is distressed
He is a great artist and pride of Telangana 🙏 https://t.co/oXP9vCoqCi
— KTR (@KTRBRS) May 5, 2024
తాజాగా ఈ పోస్ట్ పై టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ స్పందిస్తూ.. మొగిలయ్యకు అండగా నిలిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మొగిలయ్యకు అండగా నిలిచి నిజమైన నాయకుడు అనిపించుకున్నారని బ్రహ్మాజీ తెలిపాడు.
Thank uu
🙏🏼🤗@KTRBRS 👏👏 https://t.co/e6xLBOgRRN— Brahmaji (@actorbrahmaji) May 5, 2024