అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పోలింగ్(Polling) రోజు, తరువాత జరిగిన హింసాకాండపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం సిట్ (SIT) ఏర్పాటు చేసింది. 13 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన సిట్కు ఐజీ వినీత్ బ్రిజ్లాల్ (IG Vineet Brijlal) నేతృత్వం వహించనున్నారు.
సిట్ సభ్యులుగా ఏసీబీ ఎస్పీ(ACB SP) రమాదేవి, ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీలు రమణమూర్తి, శ్రీనివాసరావు, మనోహరాచారి(తిరుపతి), సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు(ఒంగోలు), ఇన్స్పెక్టర్లు భూషణం(గుంటూరు రేంజ్) , వెంకటరావు(విశాఖ ఇంటెలిజెన్స్), రామకృష్ణ(ఏసీబీ), జి.ఎల్.శ్రీనివాస్ (ఏసీబీ), మోయిన్ (ఒంగోలు పీటీసీ) ,ప్రభాకర్ ( అనంతపురం)లను నియమించింది. హింసాత్మక ఘటనలపై సీఈవో కార్యాలయం ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తిచేసి ఈసీకి నివేదించింది .