Viral news : ఓ స్కూల్ నిర్వహించిన పరీక్షలో విద్యార్థి రాసిన నవ్వు తెప్పించే జవాబులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. హిందీ టీచర్ ఇచ్చిన ప్రశ్నలకు విద్యార్థి పుస్తకంలో ఉండే సరైన సమాధానాలు రాయకుండా తన సొంత తెలివిని ఉపయోగించి వింత జవాబులు ఇచ్చాడు. విద్యార్థి ఇచ్చిన జవాబుల సరైనవి కాకపోయినప్పటికీ టీచర్ సగం మార్కులు ఇచ్చారు. విద్యార్థి తెలివిని మెచ్చకుని మార్కులు ఇచ్చినట్లు ఆ జవాబు పత్రంలో రాశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఓ హిందీ పరీక్షకు విద్యార్థి రాసిన హాస్యభరిత జవాబులతో కూడిన ఒక పేపర్ను @n2154j పేరుతో ఉన్న ఇన్స్టా హ్యాండిల్లో పోస్టు చేశారు. అయితే ఆ పరీక్ష ఏ రాష్ట్రంలో జరిగిందనే వివరాలు వెల్లడించలేదు. సోషల్ మీడియాలో పెట్టిన కాసేపటికే ఈ పోస్టు వైరల్గా మారింది. నెటిజన్ల పాజిటివ్, నెగెటివ్ కామెంట్లు వరదలా వస్తున్నాయి. ఇంతకూ ఆ పేపర్లో ఉన్న ప్రశ్నలు ఏమిటో.. వాటికి విద్యార్థి ఇచ్చిన జవాబులు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
‘సంయుక్త హల్లును రాయండి (సంయుక్త్ వ్యంజన్ లికియే)’ అని టీచర్ ఇచ్చిన ప్రశ్నకు విద్యార్థి ‘మటర్ పనీర్తో అన్ని కూరగాయల మిక్స్తో కలిపి సంయుక్త వంటకం (మటర్ పనీర్ ఔర్ సబీ మిక్స్ సబ్జియాం సంయుక్త్ వ్యంజన్ హోతీ హై)’ అవుతుంది’ అని రాశాడు. ‘భూత కాలం అని దేనిని అంటారు..? (భూత్ కాల్ కిసే కహ్తే హై..?)’ అన్న మరో ప్రశ్నకు కూడా విద్యార్థి నవ్వాపుకోలేని సమాధానం ఇచ్చాడు. ‘మన గతం.. గతం రూపంలో వచ్చినప్పుడు దాన్ని భూత కాలం అంటారు (జబ్ భూత్ హమారా కాల్ బన్కర్ ఆతా హై తో ఉసే భూత్కాల్ కహ్తే హై)’ అని విద్యార్థి రాశాడు.
అదేవిధంగా ‘బహువచనం అని దేనిని అంటారు..? (బహు వచన్ కిసే కహ్తే హై..?)’ అని టీచర్ ఇచ్చిన మూడో ప్రశ్నకు ఆ విద్యార్థి నవ్వు తెప్పించే జవాబే ఇచ్చాడు. ‘అత్తమామల మాటలు వినే కోడలును బహువచనం అంటారు (ససూరాల్ కో వచన్ సున్నే వాలీ బహు కో బహువచన్ కహ్తే హై)’ అని విద్యార్థి సమాధానం రాశాడు. అయితే ఈ మూడు జవాబులకు 10 మార్కులు ఉండగా టీచర్ 5 మార్కులు వేశారు. ‘ఈ 5 నెంబర్ నీ తెలివికి బిడ్డా’ అని టీచర్ జవాబు పత్రంపై రాశారు.