KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పై చీటింగ్ కేసు నమోదయ్యింది. ఎల్బీనగర్ ఎమ్మెల్సీ సీటు తనకు ఇస్తానని మోసం చేశాడని హైదరాబాద్లోని జిల్లెల్లగూడకు చెందిన కిరణ్కుమార్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేఏ పాల్పై కేసు నమోదు చేశారు.
గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పలు నియోజకవర్గాల్లో పోటీ చేసింది. ఆ సమయంలో ఎల్బీనగర్ సీటు కోసం జిల్లెల్లగూడకు చెందిన కిరణ్కుమార్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో తాను కేఏ పాల్ను కలవగా.. ఎల్బీ నగర్ సీటు కోసం రూ.50 లక్షలు అడిగాడని కిరణ్కుమార్ చెప్పాడు. ఈ డబ్బుల్లో 30 లక్షలను ఆన్లైన్లో చెల్లించానని.. మిగతా 20 లక్షలను పలు దఫాల్లో చెల్లించానని పేర్కొన్నాడు. అయినప్పటికీ తనకు టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేఏ పాల్పై ఫిర్యాదు చేయగా.. పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసుకున్నారు.