RS Praveen Kumar : నాగర్కర్నూల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి ప్రశ్నలు సంధిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ఇవాళ ఎర్రవల్లిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ సమక్షంలో జరిగే సభలో తన ప్రశ్నలపై ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్ ఎంపీగా వేల కోట్లు ఎలా సంపాదించారో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.
మీరు ఆస్తులు సంపాదిస్తే మీకు ఓట్లేసిన ప్రజలు ఇంకా కటిక దరిద్రంలోనే ఉండి ఎందుకు వలసపోతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ ప్రశ్నించారు. ఎంపీగా గెలువకుముందు హైదరాబాద్లో ఇళ్లు లేని మీకు కోట్ల విలువచేసే ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీశారు. నాగర్కర్నూల్ ఎంపీగా గెలిచి మల్లు రవి, ఆయన కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందని, నియోజకవర్గం మాత్రం అభివృద్ధి కాలేదని విమర్శించారు.
మల్లు రవిని మళ్లీ గెలిపిస్తే మరిన్ని ఆస్తులు సంపాదించుకుంటారే తప్ప నియోజకవర్గానికి ఆయన ఏమీ చేయరని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. మల్లు రవి కుంటుంబం పలు కంపెనీలు స్థాపించిందని, కానీ నియోజకవర్గ యువత కోసం ఆయన ఒక్క కంపెనీని కూడా తీసుకురాలేకపోయారని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజల కోసం చేసింది ఏమీ లేదు కాబట్టి.. ‘మల్లూ ఇక వెనక్కి వెళ్లు’ అని చివరల్లో క్యాప్షన్ ఇచ్చారు.
అయ్యా మల్లు రవి గారు,
ఈ రోజు ఎర్రవల్లిలో @RahulGandhi గారి సాక్షిగా మీరు కింది సమాచారం మీద కందనూలు నడిగడ్డ ప్రజలకు వివరణ ఇస్తారనే ఆశిస్తున్నా.గతంలో నాగర్ కర్నూల్ ఎంపీగా ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించుకున్నారు? మీకు ఓటేసిన ప్రజలేమో కటిక దరిద్రంలో ఉండి ఎందుకు వలస…
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) May 5, 2024