చత్తీస్గఢ్లో కారులో మంటలు చెలరేగి ముగ్గురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఒకరు జర్నలిస్ట్ ఉన్నట్లు గుర్తించారు. చెట్టును ఢీకొనడంతోనే మంటలు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనార్థం కోసం వచ్చే భక్తులతో ఆలయ సిబ్బంది, ఉద్యోగులు గౌరవ మర్యాదలతో వ్యవహరించాలని టీటీడీ జేఈవో సదా భార్గవి కార్పొరేషన్ ఉద్యోగులను కోరారు.
శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలాపై ఛార్జిషీట్ సిద్ధమైంది. దాదాపు 3 వేల పేజీలతో రెడీగా ఉన్న ఈ ఛార్జిషీట్ను నిపుణులు సమీక్షిస్తున్నారు.
షారుఖ్ ఖాన్ ఎవరని అసోం సీఎం హేమంత బిస్వ శర్మ ప్రశ్నించారు. సినిమా గురించి షారుఖ్ ఫోన్ చేస్తే విషయం పరిశీలిస్తానని చెప్పారు. డాక్టర్ బెజ్బరువా - పార్ట్ 2’ సినిమా చూడాలని పిలుపునిచ్చారు.
Shashi Tharoor | ప్రతి రాజకీయ పార్టీలో కొంత వరకు చిన్న ఫ్యాక్షన్లు ఉంటాయని, కానీ పార్టీ పెద్ద లక్ష్యాలపై ఫోకస్ చేయాలని కాంగ్రెస్ నేత శశి థరూర్ వ్యాఖ్యానించారు.