దేశవ్యాప్తంగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక పానిండియా చిత్రాల్లో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ ఒకటి. ‘కేజీఎఫ్’ ఫేం ప్రశాంత్నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్పై ఇండియా లెవల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ 50శాతం పూర్తయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఎంట్రీ సీక్వెన్స్ కోసం భారీ సెట్ల నిర్మాణం జరుగుతున్నదని సమాచారం. ఈ సీక్వెన్స్లో తారక్ గెటప్ కొత్తగా ఉంటుందట.
ఎన్టీఆర్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఈ లుక్ని ప్రశాంత్నీల్ డిజైన్ చేశారట. ఈ సీక్వెన్స్లో ఎన్టీఆర్తో పాటు నలభైమంది ఫైటర్స్ కూడా భాగం కానున్నారట. ఈ సీక్వెన్స్తో షెడ్యూల్ పూర్తవుతుందని, ఓ పాట షూట్తో నెక్ట్స్ షెడ్యూల్ మొదలవుతుందని ఇన్సైడ్ టాక్. సాధారణంగా ప్రశాంత్నీల్ సినిమా ఫ్రేమ్స్ అన్నీ బ్లాక్ అండ్ గ్రే షేడ్స్లో ఉంటాయి. కానీ ఈ సినిమాను మాత్రం ఆయన కలర్ఫుల్గా తెరకెక్కిస్తున్నారట. రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.