కరీంనగర్ : ప్రభుత్వం పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తుండడంతో తెలంగాణలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం కరీంనగర్ పట్టణంలోని 17 వ డివిజన్ శ్రీ రామ్ నగర్ కాలనీలో రూ. 26.75 లక్షలతో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్ల నిర్మాణంతో నగర రూపురేఖలు మారుతున్నాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కరీంనగర్ నగర అభివృద్ధికి ప్రత్యేక నిధుల మంజూరు చేశారని తెలిపారు. ఈ నిధులతో పనులు పురోగతి లో ఉన్నాయని వెల్లడించారు. పెండింగులో ఉన్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు.
అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్ కోల భాగ్య లక్ష్మి ప్రశాంత్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ , కార్పొరేటర్లు, కోల భాగ్యలక్ష్మి ప్రశాంత్ , ఐలేందర్ యాదవ్ దిండిగాల మహేష్, బోనాల శ్రీకాంత్, భూమా గౌడ్ , గందె మహేష్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఉచిత అంబులెన్సులను ప్రారంభించిన మంత్రి
కరీంనగర్ రెనే హాస్పిటల్స్ కు చెంది రెండు ఉచిత అంబులెన్స్ సేవలను మంత్రి శనివారం ప్రారంభించారు. రెనే హాస్పిటల్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ బంగారి స్వామి తల్లి బంగారి లక్ష్మి స్మారకార్థం రెనే హాస్పిటల్, శ్రీ లక్ష్మి మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ అంబులెన్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మున్సిపల్ నగర ప్రజలకోసం ఏర్పాటుచేసిన ఉచిత అంబులెన్సు సేవలను వినియోగించుకోవాలని సూచించారు.