పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి శివరాత్రి బ్రహ్మోత్సవాల పోస్టర్ ను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం ఆవిష్కరించారు. ఫిబ్రవరి 9వ తేదీన నిర్వహించే ఓదెల మల్లికార్జున దేవాలయం లో వీరభద్ర స్వామి దేవాలయం, బంగారు పోచమ్మ, మదనపోచమ్మ, కోనేరులను ప్రారంభించే కార్యక్రమాలకు హాజరుకావాలని నిర్వాహకులు ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఆలయ చైర్మన్, ధర్మకర్తలు మంత్రిని సన్మానించి స్వామి వారి చిత్ర పటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మేకల మల్లేష్ యాదవ్, ఈవో సదయ్య, ధర్మకర్తలు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్, బత్తుల రమేశ్, కర్రె కుమారస్వామి, అరెల్లి మొండయ్య, ఆలయ పూజారి వీరభద్రయ్య, జూనియర్ అసిస్టెంట్ ముద్దసాని కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
అంశాల స్వామి మరణం బాధకరం..
ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి ఉద్యమ నాయకుడు అంశాల స్వామి అకాల మరణం బాధకరమని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆయన మరణం తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. నల్గొండ జిల్లా ఫ్లోరోసిస్ వ్యాధి బాధితుల తరుఫున అలుపెరగని రీతిలో పోరాటం చేశారని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా స్వామి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు .