తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించడానికి చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రికైన హరితహారం కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం. డోబ్రియాల్ అన్నారు.
టీ20 ఫార్మాట్లో విధ్వంసకర బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డును పొందిన తొలి భారతీయ క్రికెటర్గా ఎస్కేవై చరిత్ర సృష్టించారు.
జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ క్యాంపస్లో వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు యత్నించిన నలుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
డొనాల్డ్ ట్రంప్ మాజీ భార్య ఇవానా ట్రంప్ వీలునామా వెలుగులోకి వచ్చింది. తన ముగ్గురు పిల్లలతోపాటు పెంపుడు కుక్క, సహాయకురాలికి కూడా ఆస్తిలో వాటా ఇచ్చింది.
ఆఫ్ఘనిస్తాన్లో భయంకర చలిగాలులు వీస్తున్నాయి. ఇక్కడి వాతావరణం కారణంగా 15 రోజుల వ్యవధిలోనే 157 మంది చనిపోయారు. ఈ మరణాలపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సమితి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నది.