మేడ్చల్, మల్కాజ్గిరి : రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయే విధంగా మన ఊరు-మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం, మేడిపల్లి మండలం కమలానగర్కాలనీలో ఆధునీకీకరణ పాఠశాలలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిరుపేదలకు నాణ్యమైన చదువుతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు మన ఊరు-మనబడిని చేపట్టిందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలన్నీ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తయారవుతున్నాయన్నారు. గత ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు పెంచుతుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేందుకు డిమాండ్ ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య ప్రతి సంవత్సరం రెట్టింపు అవుతుందన్నారు.
పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు రూ. 70 కోట్ల నిధులను మంజూరు చేసిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గంథ్రాయల సంస్థ చైర్మన్ దర్గా దయాకర్రెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి, పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్రెడ్డి, వైస్ చైర్మన్ రెడ్యానాయక్, డిప్యూటి మేయర్ శివగౌడ్, అదనపు కలెక్టర్ అభిషేక్ అగ్యస్త, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.