హైదరాబాద్ : తెలంగాణపై కేంద్రం వివక్షను కొనసాగిస్తోందని రాష్ట్ర అటవి, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆరోపించారు. కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో తెలంగాణకు నిధుల కేటాయింపు లేకపోవడం నిరాశ కలిగించిందని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు నుంచి నేటి వరకు ప్రతి బడ్జెట్ లో రాష్ట్రం పై వివక్ష చూపిస్తున్నదని ఆరోపించారు. ఈసారి కూడా నిధులు కేటాయిస్తుందని అనుకుంటే మొండి చేయి చూపిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం చేసిన అభ్యర్థనలను పట్టించుకోకుండా , చట్టబద్ధంగా రావాల్సిన నిధులనూ ఇవ్వకుండా తెలంగాణపై కక్ష సాధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై తెలంగాణ ప్రాంతానికి చెందిన బీజీపీ ఎంపీలు మౌనంగా ఎందుకుంటున్నారని ప్రశ్నించారు.