అమరావతి : నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు రావల్సిందిగా ఏపీ సీఎం జగన్ను ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కోరారు. ఈనెల 11 నుంచి 21 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని, ఈ వేడుకకు రావల్సిందిగా కోరుతూ సీఎం జగన్కు బుధవారం ఆహ్వాన పత్రికను అందజేశారు.
బ్రహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని మంత్రి వివరించారు. బ్రహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా సీఎంకు శేషవస్త్రాలతో సన్మానించి ప్రసాదాలు, దేవస్థానం క్యాలెండర్లు, డైరీని అందజేశారు.మంత్రి వెంట ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీరెడ్డివారి చక్రపాణిరెడ్డి ,ఆలయ ఈవో లస్మన్న, అర్చకులు తదితరులున్నారు.