(MLC’s oath) విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 11 మంది ఎమ్మెల్సీల చేత శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు ప్రమాణం చేయించారు. ఇటీవల స్థానిక సంస్థల కోటా కింద 11 మంది ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరంతా వైసీపీకి చెందిన వారే. అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, సురేష్ తదితరులు హాజరయ్యారు.
విజయనగరం నుంచి ఇందుకూరి రఘురాజు, విశాఖ నుంచి వరుదు కల్యాణి, చెన్నుబోయిన శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా నుంచి అనంత సత్య ఉదయభాస్కర్, కృష్ణా జిల్లా నుంచి మొండితోక అరుణ్ కుమార్, తలశిల రఘురామ్,, గుంటూరు జిల్లా నుంచి డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హన్మంతరావు, ప్రకాశం జిల్లా నుంచి తూమాటి మాధవరావు, చిత్తూరు జిల్లా నుంచి భరత్, అనంతపురం నుంచి యల్లారెడ్డిగారి శివరామిరెడ్డి లు ప్రమాణస్వీకారం చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకు సరిపడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉండడంతో 11 మంది ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దాదాపు 95 శాతం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను వైఎస్సార్ కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. తాజాగా ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం చేయడంతో శాసనమండలిలో వైసీపీ బలం పెరిగింది. ఇకపై ఎలాంటి అడ్డంకులు లేకుండా బిల్లులు పాస్ చేయవచ్చునని వైసీపీ నేతలు చెప్తున్నారు.
కరోనా సోకితే ఊపిరితిత్తులకు ప్రమాదమా? ఎలా కాపాడుకోవాలి..?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
ఒమిక్రాన్ పిల్లలపై ప్రభావం చూపిస్తుందా? ఈ వేరియంట్ లక్షణాలేంటి?
ప్రెషర్ కుక్కర్లో వండే అన్నం ఆరోగ్యానికి మంచిదేనా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..