లండన్ : (Electronic Nose) వ్యాధులను గుర్తించడంలో పరిశోధకులు ఒక అడుగు ముందుకేశారు. కొత్త రకాల పరీక్షలను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు నిత్యం కృషి చేస్తున్నారు. దీనికి ఉదాహరణగా ఎలక్ట్రానిక్ ముక్కును చెప్పుకోవచ్చు. ఈ ముక్కు సాయంతో కాలేయం, ఊపిరితిత్తులు, పెద్దప్రేగు కాన్సర్ వంటి వ్యాధులను గుర్తించేందుకు వీలున్నది. ఈ- ముక్కును మన ముక్కుపై మాస్క్లాగా అప్లై చేయడం ద్వారా మన శరీరంలో ఉన్న పలు వ్యాధులను ఇట్టే గుర్తించవచ్చునంటున్నారు బ్రిటన్ పరిశోధకులు. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ, ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ సహకారంతో బ్రిటన్లోని వివిధ దవాఖానల్లో 4000 మంది రోగులపై ట్రయల్స్ నిర్వహించి విజయవంతమైన ఫలితాలు పొందారు. అయితే, ఈ పరికరాన్ని అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలకు 51 సంవత్సరాలు పట్టడం విశేషం.
బ్రిటన్కు చెందిన బయోటెక్ కంపెనీ ఔల్స్టోన్ మెడికల్ ఈ-ముక్కును సిద్ధం చేసింది. వీరి పరిశోధన ప్రకారం, సాధారణంగా రోగికి రక్తం, మూత్రం, మలం నమూనాలను ఇచ్చేటప్పుడు కాస్తా ఇబ్బంది పడుతుంటారు. అయితే, ఈ కొత్త పరీక్ష రోగులకు చాలా సులువుగా ఉంటుంది. తక్కువ సమయం కూడా పడుతుంది.
రోగి శ్వాస నుంచి వచ్చే వ్యాధి వాసనలను గుర్తించడం ద్వారా ఈ-ముక్కు వ్యాధిని గుర్తిస్తుంది. మనం ఊపిరి పీల్చినప్పుడు, అందులో 3,500 కంటే ఎక్కువ వోలాటైల్ ఆర్గానిక్ కాంపౌడ్స్ (అస్థిరమైన సేంద్రీయ సమ్మేళనాలు) ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనిలో చాలా చిన్న గ్యాస్ రేణువులు, సూక్ష్మ బిందువులు ఉంటాయి. ఈ-ముక్కు ఈ అస్థిరమైన సేంద్రీయ సమ్మేళనాల్లో ఉండే రసాయనాలను గుర్తించడం ద్వారా వ్యాధులను నిర్ధారిస్తుంది.
ఈ పరికరాన్ని రూపొందించడానికి శాస్త్రవేత్తలకు దాదాపు 51 సంవత్సరాల సమయం పట్టింది. శాస్త్రవేత్తలు దీనిని 1970 లో అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు సమచారం. అయితే, ఆ ఆలోచనను సున్నితమైన పరికరంగా మార్చడానికి వోలాటైల్ ఆర్గానిక్ కాంపౌడ్స్ గుర్తించడానికి ప్రోగ్రామింగ్, సెన్సార్ రూపకల్పనకు దశాబ్దాలు పట్టింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో దీని పనితీరును పరీక్షిస్తున్నారు. రానున్న ఐదేండ్లలో ఈ-ముక్కు ద్వారా చేసే పరీక్ష సాధారణ పరీక్షలాగా మారుతుందని నిపుణులు అటున్నారు. వ్యాధిని గుర్తించిన తర్వాత రోగికి ఏ ఔషధం మంచిదో కూడా ఈ పరికరం తెలియజేసేలా అభివృద్ధి పరుస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఆర్థరైటిస్… కీళ్లపై ప్రభావం.. ఇవి పాటిస్తే చాలు హాయి!
పెరిగిన పెట్రో ధరలతోనే కొవిడ్ వ్యాక్సిన్లు : కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి
పెద్ద మొత్తం డాలర్లతో అష్రఫ్ ఘనీ పరారీ.. ఆధారాలు ఉన్నాయంటున్న సెక్యూరిటీ చీఫ్
మృత్యువు ముంగిట.. తండ్రిని కలిసిన కొడుకు
లఖింపూర్ మృతులకు నివాళులు.. సీతాపూర్లో ప్రియాంక అడ్డగింత
శ్రీనగర్లో కశ్మీరీ పండిట్ల ప్రదర్శన.. ముస్లింల మద్దతు
స్పేస్ సూట్ ధరించకుండా అంతరిక్షంలోకి వ్యోమగాములు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..