లఖింపూర్ : (Tributes) ఇటీవల కారు దూసుకొచ్చిన ఘటనలో మృతిచెందిన రైతులకు నివాళులర్పించే కార్యక్రమం ప్రారంభమైంది. ఐదు రాష్ట్రాల నుంచి దాదాపు 50 వేల మంది రైతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయల్దేరిన ప్రియాంక వాద్రాను సీతాపూర్లో పోలీసులు అడ్డగించారు. జయంత్ చౌదరిని బరేలిలో గృహనిర్బంధంలో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.
లఖింపూర్ హింసలో మరణించిన నలుగురు రైతులకు అర్దాస్ (నివాళి సమావేశం) మంగళవారం టికునియాలో నిర్వహించారు. ఘటన జరిగిన కి.మీ దూరంలో 30 ఎకరాల స్థలంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మరణించిన రైతులకు నివాళులర్పించేందుకు ఉత్తరప్రదేశ్తోపాటు పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ నుంచి దాదాపు 50 వేల మంది రైతులు చేరుకున్నారు. తొలుత పాలియా నుంచి వచ్చిన రాగి జాతా గుర్బానీని వివరించడం ద్వారా కార్యక్రమం ప్రారంభమైంది. మరణించిన రైతుల కుటుంబాలు, గాయపడిన రైతులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
అర్దాస్లో చేరేందుకు చాలా మంది రాజకీయ నాయకులు సిద్ధమయ్యారు. లఖింపూర్ బయల్దేరిన ప్రియాంక వాద్రాను సీతాపూర్లో పోలీసులు అడ్డుకున్నారురు. ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరిని బరేలిలో గృహనిర్బంధంలో ఉంచారు. రాజకీయ నేతలు ఎవరినీ అర్దాస్ కార్యక్రమ వేదికపైకి ఆహ్వానించమని నిర్వాహకులు ప్రకటించారు. భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేష్ తికాయత్ సోమవారం రాత్రికే అర్దాస్ వేదిక వద్దకు చేరుకున్నారు. ఇలాఉండగా, ప్రత్యేక పోలీసు దర్యాప్తు కమిటీ డీఐజీ ఉపేంద్ర అగర్వాల్, డీఎం అరవింద్ చౌరాసియా, ఎస్పీ విజయ్ ధుల్ నేతృత్వంలో భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
శ్రీనగర్లో కశ్మీరీ పండిట్ల ప్రదర్శన.. ముస్లింల మద్దతు
స్పేస్ సూట్ ధరించకుండా అంతరిక్షంలోకి వ్యోమగాములు
నీటి శుద్ధి కోసం ‘హైడ్రోజెట్ ట్యాబ్లెట్’.. సిద్ధం చేసిన అమెరికా శాస్త్రవేత్తలు
గ్యాస్ సిలిండర్ ధర రూ.2,657 కిలో పాలపొడి రూ.1,200
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..