ప్రముఖ టాలీవుడ్ నటి ప్రణీత సుభాష్ పెండ్లి పీటలెక్కింది. మే 30 2021న వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహం చేసుకుంది ప్రణీత. బెంగళూరులో జరిగిన వెడ్డింగ్ సెర్మనీకి కుటుంబసభ్యులు, స్నేహితులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయినట్టు ప్రణీత సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. లాక్ డౌన్ కాలంలో ఇలా సడెన్ గా పెండ్లి పీటలెక్కి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ప్రణీత.
ప్రణీత-నితిన్ రాజు వెడ్డింగ్ కు సంబంధించిన స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ తో రభస, పవన్కల్యాణ్ తో అత్తారింటికి దారేది, మహేశ్ బాబుతో బ్రహ్మోత్సవం చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రణీత. కర్ణాటకకు చెందిన ప్రణీత ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం హిందీలో హంగామా 2, భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రాల్లో నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ వన్స్మోర్..!
ఎన్టీఆర్ కు ట్విటర్ లో 5 మిలియన్ ఫాలోవర్లు
ట్రోల్స్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ కీ డెసిషన్..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
ప్రభాస్ మూవీ..రెమ్యునరేషన్లకే రూ.200 కోట్లు..?
లక్కీ ఛాన్స్..ఆ బ్యానర్ లోనే మళ్లీ 3 సినిమాలు..!